ప్రభుత్వ పాలిటెక్నిక్ల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
🔸మేడ్చల్ డిప్యూటీ ఎమ్మార్వో కు విద్యార్థి సంఘాల వినతి ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల ప్రైవేటీకరణ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టినా నిలిపివేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సాంకేతిక విద్యను పరిరక్షించడంతోపాటు కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ మేడ్చల్ డిప్యూటీ ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, గ్రామీణ ప్రాంతాలు, కార్మిక కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. వీటిని ప్రైవేటీకరిస్తే విద్యార్థులపై అధిక...