ప్లాట్ల పేరుతో భారీ మోసం..? బాధితులను నట్టేట ముంచి రాత్రికి రాత్రే పరార్..!

ఆర్ జె న్యూస్, మేడ్చల్ జిల్లా : జవహర్‌నగర్ పరిధిలోని పలు కాలనీలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్లు ఇప్పిస్తానంటూ లక్షల రూపాయలు వసూలు చేసిన వెంకటేష్ తమను నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. అయితే బాధితులు ఇంటి వద్దకు చేరుకునే సరికి వెంకటేష్ తాను నివసిస్తున్న ఇంటిని కూడా అమ్ముకుని, రాత్రికి రాత్రే కుటుంబంతో కలిసి పరారైనట్లు తెలిసి షాక్‌కు గురయ్యారు. తమ కష్టార్జిత సొమ్మంతా...