RJNEWS TELUGU
Date of Publish : 05 September 2026, 8:59 am Posted by : RJ NEWS TELUGU

బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ఖబర్దార్

ఆర్.జె.న్యూస్, అలియాబాద్ : మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకి రమేష్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన నిరసనలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత జాంగిర్.. DCC అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ పై ఇష్టారాజ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు మల్లారెడ్డికి లేదని, హద్దులో ఉండాలని హెచ్చరించారు. సీఎం, జిల్లా అధ్యక్షుడిని దూషిస్తే కఠిన చర్యలు తప్పవని తుంకి రమేష్ అన్నారు. ఈ సమావేశంలో ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, కంఠం కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు వనజ అశోక్ రెడ్డి, జశ్వంత్ రెడ్డి, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.