మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన వాజ్‌పేయి నగర్ బీజేపీ యువకులు

ఆర్ జె న్యూస్, మల్కాజ్‌గిరి : వినాయక్‌నగర్ డివిజన్ పరిధిలోని వాజ్‌పేయి నగర్‌కు చెందిన పలువురు బీజేపీ యువకులు జక్కుల కిరణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈరోజు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో నర్సింగ్ ముదిరాజ్, శ్యామ్, ప్రసాద్, రాజేష్, ఉమేష్, సుమేత్, యశ్వంత్, వెంకటేష్ యాదవ్, సాయిరామ్ సింగ్,...