RJNEWS TELUGU
Date of Publish : 28 August 2026, 9:22 pm Posted by : RJ NEWS TELUGU

మిస్సింగ్‌.. ఆచూకీ కోసం పోలీసుల విజ్ఞప్తి

🔸పెన్షన్‌ డబ్బుల కోసం వెళ్లి తిరిగి రాని వ్యక్తి
🔸సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీఐ గురువయ్య గౌడ్‌ సూచన
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పెన్షన్‌ డబ్బులు తీసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన జినోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మిస్సింగ్‌ వ్యక్తి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అతడి గురించి సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని జినోమ్‌ వ్యాలీ సీఐ గోపగాని గురువయ్య గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.సీ ఐ తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌ గ్రామానికి చెందిన పామిడి శేషగిరిరావు (50) ఈ నెల 27న ఉదయం సుమారు 9.30 గంటలకు నెలవారీ పెన్షన్‌ డబ్బులు తీసుకునేందుకు లాల్గడి మలక్‌పేట్‌ గ్రామపంచాయతీ కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఇంటికి తిరిగి రాలేదు. ఆయన మొబైల్‌ ఫోన్‌ కూడా స్విచ్‌ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
🔸మిస్సింగ్‌ వ్యక్తి ఆనవాళ్లు
శేషగిరిరావు ఎత్తు సుమారు 5 అడుగులు. గుండ్రని ముఖం, తెల్లటి ఛాయ కలిగి ఉంటారు. అదృశ్యమైన సమయంలో గులాబీ రంగు చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నారు. ఆయన ఎడమ కాలుకు కృత్రిమ కాలు ఉంది. తెలుగు మాత్రమే మాట్లాడగలరు.సదరు వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు, ఎక్కడైనా కనిపించిన వారు వెంటనే జినోమ్‌ వ్యాలీ పోలీస్‌ స్టేషన్‌కు లేదా 7569750241, 6281447117 నంబర్లకు సమాచారం అందించాలని సీఐ గురువయ్య గౌడ్‌ కోరారు.