RJNEWS TELUGU
Date of Publish : 02 September 2026, 8:23 am Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు!

🔸 ఐదుగురిని పట్టుకున్న కుత్బుల్లాపూర్ డివిజన్ SOT పోలీసులు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వైద్య విద్య, సరైన అర్హతలు లేకుండానే డాక్టర్ల అవతారమెత్తి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై కుత్బుల్లాపూర్ డివిజన్ SOT పోలీసులు ఉక్కుపాదం మోపారు. మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మొత్తం ఐదుగురిని పట్టుకున్నారు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎల్లంపేట్‌కు చెందిన మోత్కూరి సుధాకర్ చారి, ధర్మగోని అంజయ్యగౌడ్ ఉన్నట్లు సమాచారం. మేడ్చల్‌లో ఇద్దరు, జగద్గిరిగుట్టలో ఒకరు, పేట్‌బషీరాబాద్‌లో ఒకరు, సూరారంలో ఒకరు చొప్పున నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ముసుగులో సరైన అర్హతలు లేకుండానే చికిత్స చేస్తున్నారనే ఆరోపణలపై వారిపై చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న కుత్బుల్లాపూర్ డివిజన్ SOT పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఐదుగురిని పట్టుకుని సంబంధిత పోలీస్‌స్టేషన్లకు అప్పగించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు.