విద్యార్థుల్లో జిజ్ఞాస, ఆత్మవిశ్వాసం పెంపొందించాలి ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచన

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 11 : ఉపాధ్యాయులు పాఠ్యపుస్తకంలోని పాఠాలను బోధించడమే కాకుండా, విద్యార్థులను నైతిక విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచనలతో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి సూచించారు. శుక్రవారం కూకట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హిందీ పండితుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి రేణుకాదేవితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కాలానుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని విద్యార్థులకు అందించాలని అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను...