కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలో భారీ చిట్ ఫండ్ మోసం

🔸50 నుండి 70 కోట్లతో దంపతులు పరార్ - బాధితుల ఆందోళన ఆర్.జె.న్యూస్, కూకట్‌పల్లి : కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ పరిధిలో భారీ చిట్ ఫండ్ మోసం వెలుగులోకి వచ్చింది. చిట్టీల పేరుతో అమాయకుల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి దంపతులు పరారయ్యారు. కూకట్‌పల్లి ఇందిరానగర్‌కు చెందిన బక్కా మారుతి రెడ్డి (55) అనే వ్యాపారి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అడ్డగుట్టలో నివాసం ఉంటున్న రమణారెడ్డి, సీత దంపతులు గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ ప్రజలకు నమ్మకం కల్పించారని, ఇప్పుడు...