నీట్ పరీక్ష కేంద్రాల తనిఖీ పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి ఆదేశం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : జిల్లాలోని ఉప్పల్, మేడిపల్లి మండలాల్లో ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష కేంద్రాలను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి పరిశీలించారు. నాగోల్‌లోని సీఐఓఎస్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్, ఫిర్జాదిగూడలోని సూర్య టెక్నాలజీ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.పరీక్ష కేంద్రాల్లోని వివిధ విభాగాలను తనిఖీ చేసి, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ...