ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వినాయక చవితిని పురస్కరించుకుని గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గరిసెల సురేందర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్, లక్ష్మీనారాయణస్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు గడీల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు మట్టి విగ్రహాలను అందజేశారు.ఈ సందర్భంగా సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని కోరారు. మట్టి విగ్రహాలతో పర్యావరణహితంగా వినాయక చవితిని నిర్వహించుకోవచ్చన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.