RJNEWS TELUGU
Date of Publish : 18 August 2026, 6:52 pm Posted by : RJ NEWS TELUGU

పూడూరులో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్‌ సర్కిల్‌ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్‌ డివిజన్‌లో పూడూరు గ్రామంలో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ సృజన, డిప్యూటీ కమిషనర్‌ సుధాంశుకు నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పూడూరు గ్రామంలోని అన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు వారు పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు తమవంతు కృషి కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్‌ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్‌ మండల మాజీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌ రెడ్డి, ఏ బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు సింగరేణి పోచయ్య, మాజీ సర్పంచ్‌ బాబు యాదవ్‌, మాజీ సొసైటీ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ నీరుడి రఘు, మాజీ ఉప సర్పంచ్‌ మానేపల్లి వెంకటేష్‌, మాజీ వార్డు సభ్యులు హన్మంత్‌ రెడ్డి, శేషికుమార్‌, పుట్నాల శ్రీకాంత్‌, గ్రామస్తులు తుపాకుల తిరుపతి, బక్క నాగరాజు, బక్క శేఖర్‌, గడ్డం బాబు, శ్రీశైలం యాదవ్‌, తుపాకుల ప్రభాకర్‌, డప్పు బిక్షపతి, మజ్జిగ శంకర్‌ రెడ్డి, కుంట రంగారెడ్డి, నీరుడి సుధాకర్‌, ఏర్పుల మహేష్‌, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.