ఈజేహెచ్ఎస్ వెల్‌నెస్‌ సెంటర్‌లో డీఎంహెచ్‌వో తనిఖీ

వైద్య సేవల్లో జాప్యం ఉండకూడదు.. డా. కె. ఆనంద్‌ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం కింద కూకట్‌పల్లిలోని వెల్‌నెస్‌ సెంటర్‌ను మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్‌ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, స్టాక్‌ రిజిస్టర్లు, రోగుల ఆన్‌లైన్‌ నమోదు, అందిస్తున్న వైద్య సేవలు, రిఫరల్‌ కేసుల వివరాలను పరిశీలించారు. ప్రయోగశాల సేవలు, నమూనాల సేకరణకు అవసరమైన వాక్యూటైనర్లు, దంత వైద్య సేవల లభ్యతపై ఆరా తీశారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలోని ఓపి,...