ఆర్.జె.న్యూస్, మేడ్చల్ :మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ బాలానగర్లోని బీబీఆర్ ఆసుపత్రిని సందర్శించారు. ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఈహెచ్ఎస్ (Employees Health Scheme) నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈహెచ్ఎస్ పరిధిలో లబ్ధిదారులకు అందిస్తున్న వైద్య సేవలు, లబ్ధిదారుల నమోదు వివరాలు, సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. ఈహెచ్ఎస్ లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, నమోదు ప్రక్రియను నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించాలని ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందికి డా. ఆనంద్ సూచించారు.