క్రీడా మైదానంలో కదిలిన ఉత్సాహం!

🔸ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతుల వర్షం 🔸పాఠశాలకు వాలీబాల్ నెట్ అందజేసిన చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని అలియాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని...