వినాయక మండపాలను సందర్శించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని కీసర మండలం, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకున్నారు. ఆయా మండపాల నిర్వాహకులు మల్లారెడ్డిని ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నాలు తొలగిపోవాలని గణేష్ మహారాజ్ ను ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద...