మధుసూదన్రెడ్డి విగ్రహావిష్కరణ
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ముడుచింతలపల్లి మున్సిపల్ కేంద్రంలో మాజీ సర్పంచ్ దివంగత కామిడి మధుసూదన్రెడ్డి విగ్రహాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధుసూదన్రెడ్డి సేవలను స్మరించుకున్నారు.అంతకుముందు మధుసూదన్రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించాలని, క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆయన అన్నారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మధుసూదన్రెడ్డి కుటుంబ సభ్యులు, అభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.