RJNEWS TELUGU
Date of Publish : 13 August 2026, 2:08 pm Posted by : RJ NEWS TELUGU

ఎమ్మెల్యే డా. మురళీ నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మహబూబాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే డా. మురళీ నాయక్‌ను గురువారం మేడ్చల్‌లో కాంగ్రెస్‌ పార్టీ డివిజన్‌ అధ్యక్షులు మల్లేష్‌గౌడ్‌, చాప రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మురళీ నాయక్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు నాయకులు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనిపేర్కొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రంజిత్‌, ప్రసాద్‌, పురం రవి ముదిరాజ్‌, కాళిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.