బూత్ కమిటీలతో ప్రజలకు సేవ చేయాలి – డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గ్రామాలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులకు అవకాశం కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందని, అయితే బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులుగా ప్రజలకు నిరంతరం సేవ చేయవచ్చని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.తూంకుంటలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శామీర్పేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్ అధ్యక్షుడు నక్క సందీప్గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్,...