RJNEWS TELUGU
Date of Publish : 21 August 2026, 12:44 pm Posted by : RJ NEWS TELUGU

నల్గొండ ఉపాధ్యాయురాలి హత్యకు నిరసన. మేడ్చల్‌లో ‘శాంతి ర్యాలీ’

ఆర్.జె.న్యూస్ మేడ్చల్ : నల్గొండ జిల్లా నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం TRSMA మేడ్చల్ మండల్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి.

🔸నివాళులర్పించి ర్యాలీ

ర్యాలీకి ముందు స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి హతురాలు రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఉపాధ్యాయుల భద్రతను కల్పించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు.

🔸ప్రధాన డిమాండ్లు :

1. స్మార్ట్‌ఫోన్‌లపై కఠిన నిఘా : పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు ఏం చూస్తున్నారో గమనించాలి. దుర్వినియోగానికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు.

🔸 2.మానసిక ఒత్తిడికి చెక్ : పిల్లలపై అతి ప్రేమతో వారిని పాడు చేయొద్దు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా మాట్లాడాలని కోరారు.

🔸 3. టీచర్లకు భద్రత కల్పించాలి : నవ సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు నేడు భయంతో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను మందలించేందుకు కూడా టీచర్లు భయపడే పరిస్థితి ఉందని, దీనికి ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

4 .ఇంటి వద్ద పర్యవేక్షణ : స్కూల్‌లో పిల్లలు బాధ్యతగా ఉంటున్నారని, ఇంటికి వెళ్లాక పర్యవేక్షణ లేకపోవడమే సమస్యలకు కారణమవుతోందని తెలిపారు.

🔸5 .PTM తప్పనిసరి : తల్లిదండ్రులు రోజువారీ/వారానికోసారి/నెలకోసారి జరిగే పేరెంట్-టీచర్ మీటింగ్‌లలో తప్పనిసరిగా పాల్గొని పిల్లల ప్రవర్తనపై చర్చించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TRSMA మేడ్చల్ జిల్లా ట్రెజరర్ గిరిబాబు, మండల జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ, ట్రెజరర్ GLV నారాయణ మూర్తి, వైస్ ప్రెసిడెంట్ లవకుమార్ గౌడ్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి, కో-ఆప్షన్ మెంబర్లు మాథ్యూ జోసెఫ్, శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ తో పాటు మండలంలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.