గురుకులంలో ర్యాగింగ్ భూతం!
🔸జూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి.. చపాతీ పెనంతో వాతలు ఆర్.జె.న్యూస్,తాండూరు : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల/హాస్టల్లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థిపై సీనియర్లు దాడికి పాల్పడి తీవ్రంగా హింసించిన ఘటన వెలుగుచూసింది. తాండూరు పట్టణంలో కొనసాగుతున్న పెద్దేముల్ మండలానికి చెందిన సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకులంలో సాయి బాలాజీ అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు లోకేష్, మణికంఠ దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చపాతీ పెనంతో ఒంటిపై కాల్చి వాతలు పెట్టడంతో పాటు తీవ్రంగా కొట్టినట్లు బాధిత...