RJNEWS TELUGU
Date of Publish : 29 August 2026, 8:51 pm Posted by : RJ NEWS TELUGU

అల్వాల్ భూయజమానులకు రూ.96.5 కోట్ల పరిహారం

🔸రెండో విడతలో 63 మందికి చెక్కులు అందజేసిన కలెక్టర్ మను చౌదరి

ఆర్ జె న్యూస్ మేడ్చల్ : సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి భూములు ఇచ్చిన అల్వాల్ మండల భూయజమానులకు రెండో విడత పరిహార చెక్కులను మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అందజేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం 7,222 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చిన అల్వాల్ మండలానికి చెందిన 63 మంది భూయజమానులకు మొత్తం రూ.96.5 కోట్ల పరిహార నిధుల చెక్కులను కలెక్టర్ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) మాలతి పాల్గొన్నారు.