గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్న శ్రీకాంత్ యాదవ్
ఆర్ జె న్యూస్, కీసర : కీసర సర్కిల్ పరిధిలోని చంద్రపురి కాలనీ డివిజన్, జవహర్ నగర్ డివిజన్ లలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ సందర్శించారు. మండపాలలో కొలువుదీరిన విఘ్నేశ్వరులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లావణ్య సతీష్ గౌడ్, గొడుగు...