పోచారంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అనుమానాస్పద మృతి

ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గెలాక్సీ టవర్స్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మౌనిక సంతోషి (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటన వివరాలు మృతురాలు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనిక. యాక్సిస్ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వైజాగ్‌కు చెందిన రమాకాంత్‌ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. రమాకాంత్ ఇన్ఫోసిస్‌లో హెచ్‌ఆర్‌గా పనిచేస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కవల మగ పిల్లలు ఉన్నారు. పోలీసుల ప్రాథమిక సమాచారం...