అలియాబాద్ మున్సిపాలిటీ మజీద్‌పూర్‌లో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

అలియాబాద్ (ఆర్ జె న్యూస్) జూలై 8 : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మజీద్‌పూర్ గ్రామంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు....