ఆర్.జె.న్యూస్,మనోహరాబాద్ : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం ప్రజల నుంచి స్పందన లభించింది. కార్యక్రమానికి మొత్తం 16 మంది శాఖల అధికారులు హాజరయ్యారు. వివిధ శాఖ చెందిన అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.ఈ సందర్భంగా మొత్తం 3 ఫిర్యాదులు అందాయి. కాళ్లకల్ గ్రామంలోని సర్వే నంబర్ 148లో పారిశ్రామిక ప్లాట్లో నర్సింహ వే బ్రిడ్జి, మంజీర వైన్స్, అనిల్ కూల్డ్రింక్స్, చికెన్ సెంటర్ తదితరాలకు అక్రమంగా లీజులు ఇస్తున్నారంటూ ఫిర్యాదు అందింది.కోనాయపల్లి పీటీ శివారులోని శ్రీరాజ్ అల్యూమినియం కంపెనీ నుంచి పొగ, దుర్వాసన వస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. రంగాయపల్లి, చెట్లగౌరారం పరిధిలో ఎంఎస్ అగర్వాల్ కంపెనీ విస్తరణను నిలిపివేయాలని కోరుతూ మరో వినతి అందింది.ఫిర్యాదులపై సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
