ఆర్.జె.న్యూస్,అలియాబాద్ : అలియాబాద్ మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కొలువుదీరిన ఉప్పలమ్మ అమ్మవారి దేవాలయ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం చైర్పర్సన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పలమ్మ అమ్మవారి దేవాలయం భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆలయం పూర్తయిన తర్వాత ఈ ప్రాంత భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందని తెలిపారు.
🔸భక్తుల సహకారం కోరిన చైర్పర్సన్
ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రజాప్రతినిధులు, స్థానికులు, భక్తులు అందరూ సహకరించాలని చైర్పర్సన్ శిరీష కృష్ణారెడ్డి కోరారు. మున్సిపల్ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ రెడ్డి, పట్టణ పెద్దలు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
