ఆర్ జె న్యూస్, మేడ్చల్ :
మేడ్చల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా అంజిరెడ్డి శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. శేర్లింగంపల్లి ఎస్ ఓ టి గా పనిచేసిన ఆయన బదిలీపై మేడ్చల్ కు వచ్చారు. కాగా మేడ్చల్ ట్రాఫిక్ సిఐ గా క్రాంతి కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన సిసి ఆర్.బి నుంచి బదిలీపై మేడ్చల్ కు వచ్చారు. ఇదిలా ఉంటే ఇక్కడ సిఐ గా పని చేసిన ఆదాని సత్యనారాయణ, డి ఐ కిరణ్, ట్రాఫిక్ సిఐ మధుసూదన్ ను మేడ్చల్ నుంచి బదిలీ చేస్తూ మల్టీజోన్ 2 ఐజి కి రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తూ సైబరాబాద్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
