ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని యాడారం గ్రామ ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో గురువారం విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ లింగోళ్ల హనుమానదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యతో పాటు పరిశుభ్రత, క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, గ్రామ నాయకులు చేద్రి సాయిలు, మనీపుత్ర మహేష్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
యాడారం పాఠశాల విద్యార్థులకు షూస్ పంపిణీ
RELATED ARTICLES
