🔸 5వ వార్డులో చైర్పర్సన్ శిరీష కృష్ణారెడ్డి ప్రారంభం
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని 5వ వార్డులో మున్సిపల్ జనరల్ నిధుల నుంచి రూ.6 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన భూగర్భ డ్రైనేజీ (UGD) నిర్మాణ పనులను గురువారం చైర్పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే పురపాలక సంఘం లక్ష్యమని, వార్డుల అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కన్రెడ్డి మాలతి మాధవ రెడ్డి, కౌన్సిలర్లు తల్లా స్వప్న రాంప్రసాద్, తలారి మౌనిక బాబు, కైరా గణేష్, మున్సిపల్ ఏఈఈ సనా షాహీన్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు..!
.
