🔸అమ్మవారికి మొక్కులు చెల్లించిన జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్
ఆర్.జె.న్యూస్, జవహర్ నగర్ : కీసర సర్కిల్, జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని కేసీఆర్ నగర్లో ఆషాడ మాస బోనాల పండుగ ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక మహిళలు, భక్తులు భక్తిశ్రద్ధలతో పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆషాడ మాస బోనాల పండుగ మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అని, అమ్మవారి దయతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ధన్రాజ్, సతీష్, శ్రీకాంత్, మారుతి, చంద్రశేఖర్, రాజేందర్ నాయకులతో పాటు స్థానిక బస్తీవాసులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
