Saturday, August 29, 2026
Homeమేడ్చల్ జిల్లాగుంతే ప్రాణం తీసింది.. బైక్ జారిపడి...

గుంతే ప్రాణం తీసింది.. బైక్ జారిపడి లారీ కింద పడ్డ మహిళ

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్ బ్యూరో : మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారిపై జనతా హోటల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డబిల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో విధులకు వెళ్తున్న నీతూదేవి (43) సోమవారం జనతా హోటల్‌ సమీపంలో బైక్‌పై వెళ్తుండగా వర్షం కారణంగా రోడ్డుపై ఏర్పడిన గుంతలో బైక్‌ జారిపడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంలో నీతూదేవికి కళ్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా.. ఈఎంటీ సీతారాం, పైలట్‌ తిరుపతి ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈఆర్‌సీపీ డాక్టర్‌ చక్రవర్తి సూచనల మేరకు ప్రథమ చికిత్స అందించి ఈఎస్‌ఐ ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.ప్రమాదంపై మేడ్చల్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!