ఆర్. జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్లోని ముకుత్ ఫంక్షన్ హాల్లో అంబేద్కర్ ఆటో యూనియన్ INTUC ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆటో యూనియన్ ప్రతినిధులు, కార్మికులు హాజరయ్యారు.సమావేశంలో రామన్న, రాఘవేందర్, రఘుగౌడ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం, యూనియన్ బలోపేతం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని సమావేశంలో నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావు, ఉపాధ్యక్షుడు ఓం రాజ్, ప్రధాన కార్యదర్శి కొమ్మురాజు గౌడవెల్లి, పూతడి నర్సింగ్రావు, సత్యనారాయణ, ఖలీల్భాయ్, నరేష్, దుర్గాపతి, ఆర్. గణేష్, సురేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ అంబేద్కర్ ఆటో యూనియన్ సమావేశం..! ఆటో కార్మికుల సమస్యలపై చర్చ
RELATED ARTICLES
