మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 11 :
దక్షిణాసియా రాక్ బాల్ టోర్నీలో భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించిన పూడూర్ గ్రామానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు గోపాల్ యాదవ్ ను శనివారం మేడ్చల్ సీఐ సత్యనారాయణ శాలువాతో సన్మానించారు. రాక్ బాల్ ఇండియా టీమ్ లో సభ్యుడిగా టోర్నీలో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించి గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయం సీఐ అన్నారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించి మరింత గుర్తింపు సాధించాలని కోరారు.కార్యక్రమంలో జర్నలిస్ట్ లక్ష్మణ్ యాదవ్, యువకులు సల్మాన్, ఆనంద్,కిరణ్ తదితరులుపాల్గొన్నారు.
