Saturday, September 19, 2026
Homeమేడ్చల్ జిల్లాఘనంగా ముదిరాజ్ సంఘం వినాయకుడి నిమజ్జన...

ఘనంగా ముదిరాజ్ సంఘం వినాయకుడి నిమజ్జన మహోత్సవం

📰 Generate e-Paper Clip

ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన మహోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి శివ ప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటలో మేకల కృష్ణకృష్ణవేణి దంపతులు రూ.11,116లకు లడ్డూను కైవసం చేసుకున్నారు.అనంతరం భక్తిశ్రద్ధలతో వినాయకుడి విగ్రహాన్ని మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయ ప్రాంగణంలోని మంజీరా నదికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా దుర్గా భవాని మాత ఆశీస్సులతో గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల పాడి పంటలు బాగా పండి,అధిక దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు జీ.పరమేశ్, నీరుడి శ్రీరామ్, మాజీ ఎంపీటీసీ నీరుడి రఘు, సంఘం నాయకులు మర్రిచెట్టు ప్రసాద్, కొండ శ్రీనివాస్, బలబోయిన శివ, గుడిసె నర్సింహా, మర్రిచెట్టు శ్రీనివాస్, కుంట రవి, తిరుమణి రమేష్, వెంకట్, లచ్చు నర్సింహా, మేకల కృష్ణ,సాడే రాజు, అర్జున్, పుట్నాల శోభన్, నీరుడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!