Sunday, August 16, 2026
Homeరాజకీయండీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్‌ను కలిసిన...

డీసీసీ అధ్యక్షుడు జంగయ్య యాదవ్‌ను కలిసిన షామీర్‌పేట్ డివిజన్ నూతన అధ్యక్షుడు

మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 3 :
నూతనంగా నియమితులైన 300–షామీర్‌పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నక్క సందీప్ గౌడ్ బుధవారం డీసీసీ అధ్యక్షులు తోటకూర జంగయ్య యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు జంగన్న సందీప్ గౌడ్‌ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా తయారు చేయాలని సందీప్ గౌడ్‌కు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అజయ్ యాదవ్, లక్ష్మీ రెడ్డి, టి.ఆర్. రవీందర్ గౌడ్, యేసుదాస్, పి. అశోక్, ఆర్. గణేష్ మరియు సాత్విక్ కొత్త పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందీప్ గౌడ్‌కు పలువురు నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!