ఆర్ జె న్యూస్, మేడ్చల్ : “మీ సమస్య–మా పరిష్కారం” కార్యక్రమంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డులోని ప్రజా సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మహిళా శక్తి మై వాయిస్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎన్. హైమారెడ్డి కోరారు. ప్రజల ఆహ్వానం మేరకు వార్డులో పర్యటించిన ఆమె రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీటి సరఫరా, గృహాలపై వసూలు చేస్తున్న పన్నుల అంశాలను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ను కలిసి పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మహిళా శక్తి మై వాయిస్ సంఘం ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన పథకాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళా శక్తి మై వాయిస్ సంఘం ట్రెజరర్ అంబటి రమేష్, అలియాబాద్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షుడు కొరివి కృష్ణ, బీజేపీ యువమోర్చా నాయకుడు శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
