ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మండలం కిష్టాపూర్ గ్రామంలోని టీజీ గర్ల్స్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ ఏసీపీ చి. శంకర్ రెడ్డి, మేడ్చల్ ఇన్స్పెక్టర్ అంజి రెడ్డి, ఎస్ఐ బి. యతీష్ చంద్రతో పాటు మేడ్చల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు.ఈ సందర్భంగా పాఠశాల బోధనా సిబ్బందిని పోలీసు అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్ప్రభావాలు, మహిళలపై జరిగే నేరాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.విద్యార్థులు సామాజిక విలువలను అలవర్చుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని అధికారులు సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాను అప్రమత్తంగా వినియోగించాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి ఎదురైతే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
