Wednesday, September 9, 2026
Homeతెలంగాణసిద్ధిపేటఆపదలో అండగా దుబ్బాక ఎమ్మెల్యే.. కాన్వాయ్...

ఆపదలో అండగా దుబ్బాక ఎమ్మెల్యే.. కాన్వాయ్ ఆపి మరీ సాయం

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, బ్యూరో : మానవత్వం చాటుకున్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.  సిద్దిపేట నుంచి దుబ్బాక వెళ్తుండగా ఇర్కోడు-తొర్నాల మధ్యలో పండ్ల వాహనం బోల్తా పడటాన్ని చూసిన ఆయన.. తన కాన్వాయ్ ను వెంటనే ఆపి క్షతగాత్రుల వద్దకు పరుగులు తీశారు. బాధితులు కరీంనగర్ కు చెందిన వారిగా గుర్తించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆలస్యం లేకుండా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే స్పందించిన తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!