ఆర్.జె.న్యూస్, వనస్థలిపురం : వనస్థలిపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిక్స్ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వారాహి సిక్స్ సంస్థ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధి సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మొద్దు లచ్చి రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంస్థ నిర్వాహకులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
