ఆర్ జె న్యూస్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బోయిన్పల్లి పరిధిలోని సెవెన్ టెంపుల్స్, సీతారామపురం, పెద్ద తోకట్ట, బాపూజీ నగర్, పెన్షన్ లైన్ ప్రాంతాల్లోని రేషన్ కార్డుదారులకు పంపిణీ చేశారు.ప్రజలకు సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా, సులభంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డీఎస్ఓ శ్రీనివాస్, ఏఎస్ఓ కృష్ణవేణి, ఇన్స్పెక్టర్ కిరణ్మయి, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీగణేష్
RELATED ARTICLES
