♦️ 12 మంది అరెస్టు – రూ.16,900 నగదు స్వాధీనం..
ఆర్ జె న్యూస్, కీసర :
అహ్మదూడలోని డబుల్ బెడ్రూం ఫ్లాట్లలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కీసర పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. డబుల్ బెడ్రూం ఫేజ్-1, బ్లాక్ నెం. 01, 5వ అంతస్తులోని గది నెం. 501లో ఎవరికీ తెలియకుండా కొందరు పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న 12 మందిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
♦️నగదు, ఇతర సామాగ్రి స్వాధీనం.
అరెస్టు చేసిన వారి నుంచి రూ. 16,900 నగదు, 19 పేకాట కట్టలు, 13 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో ఎం.జీ. బేగం పేకాట నిర్వహిస్తున్నట్లు, ఆమెకు అమీరోద్దిన్ సహకరిస్తున్నట్లు వెల్లడైంది.
♦️కేసు నమోదు
ఈ మేరకు 12 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు. ప్రాంతంలో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని, అలాంటి వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
♦️బాక్స్ ఐటమ్ :
♦️స్వాధీనం చేసినవి :
♦️నగదు: రూ. 16,900
♦️పేకాట కట్టలు: 19
♦️మొబైల్ ఫోన్లు: 13
