ఆర్ జె న్యూస్, మేడ్చల్ :
అలియాబాద్ మున్సిపాలిటీ 7వ వార్డు కౌన్సిలర్ గాదె వెంకటేష్ సోమవారం హకీంపేట్ డిపో మేనేజర్ సరితా దేవిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.హెచ్బీఎల్ (HBL) రిక్వెస్ట్ స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు నిలవకపోవడంతో ప్రయాణికులు, వివిధ కంపెనీల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి, అన్ని బస్సులు హెచ్బీఎల్ స్టాప్ వద్ద ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.వినతిపై స్పందించిన డిపో మేనేజర్ సరితా దేవి, ఇకపై ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హెచ్బీఎల్ స్టాప్ వద్ద బస్సులు నిలిపేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గాదె వెంకటేష్ తెలిపారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
