Sunday, August 16, 2026
Homeతెలంగాణమేడ్చల్ వంజరి సంఘం నూతన కమిటీ...

మేడ్చల్ వంజరి సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మేడ్చల్ ఆర్ జె న్యూస్ జూలై 11:

మేడ్చల్ వంజరి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం జరిగిన సంఘ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా ఎదుగని చంద్రశేఖర్‌రావు వంజరి, ప్రధాన కార్యదర్శిగా కానుకంటి వెంకటేష్ వంజరి, కోశాధికారిగా థాత్రిక లక్ష్మణ్ వంజరి, యువ అధ్యక్షుడిగా కానుకంటి సంతోష్ వంజరి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ త్వరలో పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసి సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మాజీ అధ్యక్షుడు మైసరి పరమేశ్వర్ వంజరి, మాజీ ప్రధాన కార్యదర్శి ఎదుగని శ్రీనివాస్‌రావు వంజరి, మాజీ కోశాధికారి థాత్రిక లింగం వంజరి నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించి శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలియజేయగా, పాత కార్యవర్గం సేవలను కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!