ఆర్ జె న్యూస్ మేడ్చల్ :
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుధాంష్, మేడ్చల్ పోలీస్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డిలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ నాయకులు అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ 297 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్, 298 డివిజన్ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, 299 డివిజన్ అధ్యక్షుడు గర్శాల సురేందర్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ, మాజీ కౌన్సిలర్లు కౌడే మహేష్ కురుమ, పాలకుర్తి రాఘవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు బొక్క రఘుపతి రెడ్డి, చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్, సత్తి రెడ్డి, హనుమంత్ రెడ్డి, లవంగు రాకేష్ వంజరి, దండు శ్రీకాంత్ (చింటు), పెగుడ శ్యాంరావ్, కాలేరు శ్రీకాంత్ వంజరి, కనకాల ప్రశాంత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
