Saturday, August 15, 2026
Homeక్రైమ్ న్యూస్యాప్రాల్ ఎక్స్‌రోడ్స్‌లో హత్యాయత్నం కేసు ఛేదన..!

యాప్రాల్ ఎక్స్‌రోడ్స్‌లో హత్యాయత్నం కేసు ఛేదన..!

🔸ముగ్గురు నిందితుల అరెస్ట్.. కత్తి, బైక్ స్వాధీనం

🔸 సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్న జవహర్ నగర్ పోలీసులు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ ఎక్స్‌రోడ్స్ వద్ద జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు సందీప్ కుమార్‌పై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో  ఎసిపి చక్రపాణి మీడియాకు వివరాలను వెల్లడించారు. సందీప్ కుమార్ అలియాస్ కట్లస్, ఎస్. వివేక్, వి. సుమిత్ రాజుబన్లు కలిసి సందీప్ కుమార్‌పై కత్తితో దాడి చేసినట్లు గుర్తించారు. ఘటన అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయోగించిన కత్తితో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ముగ్గురినీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించినట్లు ఎసిపి తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!