Thursday, September 10, 2026
Homeతెలంగాణహైదరాబాద్పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల...

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

📰 Generate e-Paper Clip

ఆర్.జె.న్యూస్, గచ్చిబౌలి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. క్రైమ్ నంబర్ 642/2023, సెషన్స్ కేసు నంబర్ 313/2023కు సంబంధించి రాజేంద్రనగర్ లోని రేప్, పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి టీ. శ్రీనివాస్ తీర్పును వెలువరించారు. రేప్, పోక్సో, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడు మీనగల వెంకుగోపాల్ అలియాస్ వేణు (42) కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పక్కా ఆధారాలతో కోర్టులో అభియోగాలను నిరూపించారని పోలీసు అధికారులు తెలిపారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!