Friday, August 14, 2026
Homeజాతియంఢిల్లీలో ఈటల రాజేందర్‌ నివాసంలో జాతీయ...

ఢిల్లీలో ఈటల రాజేందర్‌ నివాసంలో జాతీయ జెండా ఆవిష్కరణ

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హర్‌ ఘర్‌ తిరంగా పిలుపు మేరకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయ పౌరుడు హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకుని harghartiranga.com వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశభక్తిని చాటుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install RJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!