🔸ఆత్యవసర వైద్య వాహన సేవలు ప్రజలకు వరం
🔸ఎల్లవేళల.రోగులకు అందుబాటులో ఉండాలి..
ఆర్ జె న్యూస్ : కొందుర్గు మండల కేంద్రంలో నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య వాహన సేవలైన 102 108 అంబులెన్స్ లను జిల్లా వాహన వైద్య సేవల అధికారులు రాజబాబు, జాన్ షాహిద్ ఆకస్మిక తనిఖీ చేశారు.అత్యవసర సమయాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంబులెన్స్లలోఉన్న అత్యవసర వైద్య పరికరాలు, మందులు, ఆక్సిజన్ సదుపాయాలు, ఇతర వైద్య సామగ్రితో పాటు వాహనాల నిర్వహణను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి జాప్యం లేకుండా రోగులను ఆసుపత్రులకు తరలించేలా అంబులెన్స్లు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో 102,108 ఈయంటి రమేష్, పైలట్ నరేష్ కెప్టెన్ రాఘవేందర్ పాల్గొన్నారు…
